
అక్షర ఆయుధం సెప్టెంబర్:2 రిపోర్టర్( బుయ్యన శ్రీ ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలం లో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు ఘనంగా కుక్కునూరు మండల కేంద్రంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినారు ప్రధాన కూడలి వద్ద ఉన్న వైస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వైస్సార్ పార్టీ మండల అధ్యక్షుడు తాండ్ర. రాజేష్ మాట్లాడుతూరైతులు, పేదల కోసం వైఎస్ఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, జలయజ్ఞం వంటి పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు తాండ్ర రాజేష్ , మండల ఉపాధ్యక్షులు మాదిరాజు వెంకన్న బాబు, రాయి సత్యనారాయణ, మండల మాజీ అధ్యక్షులు కుచ్చర్లపాటి నరసింహ రాజు, రావు వినోద్,మండల ప్రధానకార్యదర్శి పగిళ్ల అల్లేషు, యువజన విభాగం మండల అధ్యక్షులు చేకూరి నవీన్ వర్మ, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి గాడిద రాంబాబు దాసారం ఎంపీటీసీ సభ్యుడు సోడే సాదు, మండల సీనియర్ నాయకులు, జక్కం నాగేశ్వరావు, కుచ్చర్లపాటి చిన్న నరసింహారాజు, మోకరాల సతీష్ , నాగుల్ మీరా,కుక్కునూరు టౌన్ ప్రెసిడెంట్ రాయి మధు, అయితే కోటేశ్వరావు, సావిలి ఏసు, వేముల వినయ్, పగిల్ల అనిల్, ఆది శ్రీను, సత్యనారాయణ,రవి , మరియు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ,కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొని రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.